Friday, February 24, 2017

చరిత్ర

 నువ్వు చెప్పిన చరిత్ర, నాకెందుకో ఎక్కలేదు నేస్తం
 అప్పుడెపుడో అందరూ సమానం అని చెప్పిన అన్నమయ్య
 అన్ని వదిలేసి తిరిగుతూ నిజాలు నిర్భయంగా చెప్పిన వేమన
 పంట పండిస్తూ పదం పదం పదిలం చేసుకున్న మా పోతన్న
 తెలుగు వారిని ఒక్కసారి కుదిపేసిన శ్రీ శ్రీ
 మట్టికాదు మనుషులే ముఖ్యం అన్న గురుజాడ
 గాయపడి భాదపడి గేయాలు వ్రాసిన గుర్రం జాషువా
 జనపదమే తమ పదమని పద పదమంటూ త్రోవ చూపిన ఈ తరం వాగ్గేయకారులు 
 కష్టాలకు స్పందిస్తూ ఎప్పటికప్పుడు తప్పులు ఎత్తిచూపిన వీళ్ళని  మినహాయిస్తే
నువ్వు చెప్పిన చరిత్ర, నాకెందుకో ఎక్కలేదు నేస్తం